SRH VS RCB : సన్ రైజర్స్ విజయాలకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పటిదార్ కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సులతో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ స్పిన్నర్లను టార్గెట్ గా చేసుకుని సిక్సులు బాదాడు.
విరాట్ కోహ్లి కూడా అర్థ సెంచరీతో రాణించాడు. విరాట్ మొదట స్పీడ్ గా ఆడిన తర్వాత స్లో అయ్యాడు. సన్ రైజర్స్ మొదట స్పిన్ తో బౌలింగ్ ప్రారంభించింది. అభిషేక్ శర్మ మొదటి ఓవర్ లో 10 పరుగులు సమర్పించుకున్నాడు. జై దేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కు ఒక్క ఓవర్ మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు చేసిన హెడ్ విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆర్సీబీ ప్రయోగం విల్ జాక్స్ రూపంలో ఫలించింది. లెఫ్ట్ హ్యండ్ బ్యాటర్ కు రైట్ ఆర్మ్ స్పిన్ తో బౌలింగ్ చేయించిన డుప్లెసిస్ హెడ్ ను బుట్టలో వేసే ప్లాన్ సక్సెస్ అయింది. తర్వాత అభిషేక్ శర్మ మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది గత మ్యాచ్ ఊపు కొనసాగించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 31 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కమ్, క్లాసెన్, నితిశ్ రెడ్డి, సమద్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే షాబాద్, కమిన్స్ కాస్త జోరు ప్రదర్శించిన అది స్కోరు బోర్డుపై అంతరం తగ్గించేందుకు మాత్రమే పనికొచ్చింది. కమిన్స్ మూడు సిక్సులు బాది 15 బంతుల్లోనే 31 పరుగులు చేసినా ఆ తర్వాత ఔట్ కావడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. చివరి వరకు క్రీజులో ఉన్న షెహబాజ్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ రాణించి సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 171/8 తో ఇన్సింగ్స్ ను ముగించింది. ఆర్సీబీకి ఆరు మ్యాచ్ ల తర్వాత ఓ విజయం దక్కడం ఊరట కలిగించింది.