Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం సాయంత్రం వాంఖడే మైదానంలో హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ పై ఉప్పల్ స్టేడియంలో 276 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అయితే ముంబయి ఇండియన్స్ కూడా ధీటుగానే జవాబిచ్చినా 246 పరుగుల వద్ద ఆగిపోయింది.
ముంబయి బౌలర్లపై హెడ్, అభిషేక్ శర్మలు సిక్సులతో విరుచుకుపడ్డారు. ముంబయి బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముంబయి బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడుతున్నారు. ఇషాన్ కిషన్ నుంచి గొప్ప ఇన్సింగ్స్ ను ముంబయి టీం కోరుకుంటోంది. ముంబయి పాయింట్ల పట్టికలో 11 మ్యాచుల్లో 3 గెలిచి చివరి స్థానంలో ఉంది. ఇంకా మూడు మ్యాచులు గెలిచినా ఒరిగేది ఏమీ లేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీతో మళ్లీ ఫామ్ అందుకుంది. కీలక సమయాల్లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ పై బ్యాటింగ్ లో 200 పరుగులు చేయగలిగారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ ఫామ్ లోకి రావడం సన్ రైజర్స్ కు శుభ పరిణామం.
నటరాజన్ పర్పుల్ క్యాప్ తో అదరగొట్టేస్తున్నాడు. ప్రతి మ్యాచులో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెడుతున్నారు. సన్ రైజర్స్ 10 మ్యాచులు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే రాబోయే మూడు మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్యాట్ కమిన్స్ ఈ సారి ఎలాంటి ప్లాన్ తో ముందుకు రానున్నడో వాంఖడేలో తెలిసిపోనుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరేట్ టీం అని అందరూ అనుకుంటున్నారు.