అన్న నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లు అన్న నందమూరి తారకరామారావు కు ఘనంగా నివాళులు అర్పించారు. పలు చోట్ల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
అంతేకాదు పలు దేశాల్లో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు , నందమూరి అభిమానులు జోహార్ ఎన్టీఆర్ ….. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు ఇస్తూ ఎన్టీఆర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.