Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు ఉన్నాయి. లోక్ సభ బరిలో నిలిచేందుకు బండి సంజయ్ తనకు ఉన్న ఆస్తులు, అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను రిటర్నింగ్ అధికారులకు అందజేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనకు సొంతిల్లు, గుంట భూమి కూడా లేదని, మొత్తం 41 కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు.
కుటుంబ ఆస్తుల విలువ రూ.1.12 కోట్లు, స్థిరాస్తులు లేకున్నా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాహనాల కోసం తీసుకున్న అప్పులు రూ. 13.4 లక్షలు ఉన్నాయని, ఆయన సతీమణికి 43 తులాల బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.