![Keshineni Nani](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/01/IMG_20240110_081405.jpg)
Keshineni Nani : రాజకీయ చదరంగంలో గెలుపు ఓటమిలు సహజం. ఒకసారి గెలిచిన నాయకుడు, మరోసారి గెలవాలనే నమ్మకం లేదు. ఓటమి చెందిన నాయకుడు కూడా గెలవాలనే నమ్మకం కూడా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. రాజకీయంలో హత్యలు ఉండవు. ఆత్మ హత్యలే ఉంటాయి. ఇందుకు తార్కాణం విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కేశినేని నాని ఒకరు.
కేశినేని నానికి తెలుగు దేశం పార్టీలో ఒక ప్రధానమైన గుర్తింపు ఉంది. అంతే కద్దు అధినేత చంద్రబాబు నాయుడి వద్ద కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. అటువంటి నాయకుడికి పుట్టిన దుర్భుద్దే తన ఓటమికి ప్రధాన కారణమైనది.ఇంకో విదంగా చెప్పాలంటే వైసీపీ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధాన కారణమే అవుతుంది.
ఎన్నికల సమయం ఆసన్నమయ్యే వరకు కూడా చంద్రబాబు వెంటే ఉన్న కేశినేని నాని అకస్మాత్తుగా ఒక్కసారి తన నిర్ణయాన్ని మార్చు కున్నారు. వెంటనే వైసీపీ కండువా వేసుకున్నారు. విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్వయానా సోదరుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఘన కార్యాలు కూడా మరొక కారణమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన పుణ్య కార్యక్రమాలు కూడా కేసి నేని నాని మోయడంతోనే ఓటమిని రుచి చూడాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పాటించడం నాని తో సాధ్యం కాలేదు. హద్దులు మీరు ప్రవర్తించారనే పేరు కూడా మూటగట్టుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ కండువా కప్పుకొని తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారనే అభిప్రాయాలు ఆయన సహచరుల నుంచి వ్యక్తం కావడం విశేషం. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే కేశినేని నాని రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.