- 599 మార్కులు సాధించిన మనస్వి
AP 10th Results : ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఆ విద్యార్థిని పేరు ఆకుల వెంకటనాగసాయి మనస్వి. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధిక మార్కులు. 2022లో 598, 2023లో 597 మార్కులు వచ్చాయి. కాగా ఇప్పుడు ఆ రికార్డులను మనస్వి బద్దలుకొట్టింది.
ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకటనాగసాయి మనస్వికి హిందీ సబ్జెక్టులో తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు వచ్చాయి. హిందీలో 99 మార్కులు వచ్చాయి. టెన్త్ ఫలితాల్లో మనస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 22న అధికారులు ప్రకటించారు. టెన్త్ ఫలితాల్లో 6.16 లక్షల మంది విద్యార్థుల్లో 86.69 శాతం (5.34.573) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.