తేట తెలుగు తేనే లొలుకు అంటారు. మనం పుట్టింది పెరిగింది తెలుగులోనే కాబట్టి ఈ భాషను బాగానే మాట్లాడగలం.. అదే ఉత్తర భారతం వెళితే.. ఢిల్లీలో అడుగుపెడితే హిందీలో మాట్లాడాలి. కానీ మన తెలుగోళ్లకు హిందీ కంటే కూడా ఇంగ్లీష్ ఈజీ. ఇంగ్లీష్ నే చాలా మంది ఈజీగా మాట్లాడుతారు. దక్షిణ భారతీయులకు హిందీ అబ్బలేదు.
ఏదో ఒక అంశంలో భిన్నంగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి అంతపురం జిల్లా ఎంపీ గోరంట్ల మాధవ్.. తాజాగా పార్లమెంటు పై జరిగినటువంటి దాడి ని అక్కడ ఉన్న జాతీయ మీడియాకు వివరించే తీరు చూస్తే మీరు అభినందించకుండ ఉండలేరు మరి.. తనకు వచ్చిన, నచ్చిన ఇంగ్లీష్ లో పార్లమెటులో అసలు ఏమీ జరిగింది యంపీ మాదవ్ వారిని ఎలా పట్టుకున్నాడో పూసగుచ్చినట్లు జాతీయ మీడియాకు చెబుతున్నారు మీరు ఓకసారి పై వీడియోలో వినండి…
అయితే ఆయనకు ఇంగ్లీష్ సరిగ్గా ఫ్లూయింట్ గా రాకపోవడంతో ఎంపీ గోరంట్ల నానా ఇబ్బందులు పడ్డారు. బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అసలు విషయాన్ని కన్వే చేయడానికి నానా అగచాట్లు పడ్డారు. గోరంట్ల బట్టర్ ఇంగ్లీష్ చూశాక చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంపీ అయ్యిండి ఇంగ్లీష్ రాదా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక సీఐగా ఉండి అప్పటి టీడీపీ నేతలను ఎదురించి ఫేమస్ అయిన గోరంట్ల మాధవ్ కు జగన్ ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. అలా కొద్దిరోజుల్లోనే పోలీస్ నుంచి ఎంపీ అయిపోయారు. ఇప్పుడీ భాష ప్రాబ్లంలో పడి పాపం బుక్కయ్యారు.