నంద్యాల జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొం టారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట చేరుకొని, అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. నారా్ లోకేష్ నంద్యాల జిల్లా శ్రీశైల దర్శనం కోసం వస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు ఉదయం నారా లోకేష్ 9.40 నిమిషాలకు శ్రీశైల ఆలయానికి చేరుకుంటారు. దైవ దర్శనం తర్వాత నారా లోకేష్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.