![Kharge](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-13-4.jpg)
Kharge : భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా పీఎం మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో
భాగంగా శనివారం హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే.. మోదీపై విమర్శలు గుప్పించారు.
‘‘నాటి భారత ప్రభుత్వం (కాంగ్రెస్ హయాంలో) పాకిస్థాన్ తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం భారత్ భూభాగాలను చైనా ఆక్రమించింది. అక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయినా, ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు.
అలాగే 2023లో హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో హిమాచల్ పరిస్థితి దుర్బలంగా ఉంది. నాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల సాయం కోరినా కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.