![Bangalore Rave Party](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-12-1-1.jpg)
Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈరోజు నిందితులను బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించనున్నారు. అందులో భాగంగా టీలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో వీరు విచారణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్ లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన హేమ, పోలీసుల విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్టు విషయం తెలిసిందే.