Varun Tej Lavanya tripathi : మెగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మేగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం శుక్రవారం (జూన్ 9వ తేదీ) రోజున గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరికొంత మంది మెగా ఫ్యామిలీకి చెందిన వారు అటెండ్ అయ్యారు. కానీ నాగబాబు ఇంట్లో నిర్వహించిన ఈ నిశ్చితార్థానికి మాత్రం అల్లుడు చైతన్య మాత్రం హాజరుకాలేదు. దీంతో గాసిప్ లు మొదలయ్యాయి. అవి కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. మామా, అల్లుడి మధ్య దూరం పెరిగిందని, ఇదే విషయంలో నిహారిక పుట్టింటికి వచ్చి ఉంటుందని వైరల్ అవుతుంది.
గుంటూరు ఐజీ కొడుకు చైతన్యతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది నిహారికకు. ఆ సమయంలో అత్తింటి విషయాలను పోస్ట్ చేస్తూ వచ్చింది నిహారిక. తనను తన అత్తింటి వారు బాగా చూసుకుంటున్నారని, ఒక కూతురుగా చూస్తారని, తను ఏది అడిగా ఇస్తారని చెప్పుకొచ్చారు. నిహారిక పోస్ట్ లు, ఇంటర్వ్యూలపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొత్తలో అలాగే ఉంటుందని కొందరంటే. మెగాను అలా చూసుకోవాల్సిందే అని మరికొందరు. ఈ నేపథ్యంలో ఇటీవల నిహారిక సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు పక్కన చైతన్య పేరును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలే వినిపిస్తున్నాయి.
చైతన్యను విడిచిపెట్టి పుట్టింట్లోనే ఉంటుంది నిహారిక. దీనిపై చాలా మంది ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మెగా ఫ్యామిలీ. అయితే శుక్రవారం రోజు జరిగిన బావమరిది నిశ్చితార్థ వేడుకలకు చైతన్య హాజరు కాలేదు. దీంతో ఇన్నాళ్లు సోసల్ మీడియాలో వచ్చిన గాసిప్ లు నిజమేనని నమ్ముతున్నారు కొందరు. నాగబాబుకి షాక్ ఇచ్చిచాడట చైతన్య. దీంతో పాటు చైతన్య ఈ నిశ్చితార్థంపై స్పందించినట్లు మరికొన్ని గాసిప్ లు వచ్చాయి. ‘వీరు బాగా ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటారు కానీ, కాపురాలు మాత్రం చేయరంటూ’ అన్నట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బావమరిది నిశ్చితార్థం వేడుకలో బావ కనిపించకపోవడంతో ఇన్నాళ్ల వార్తలు నిజం అనుకునే ఛాన్స్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.