Palnadu : చిలకలూరిపేట ప్రజాగళంలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హై ప్రోటోకాల్ తో ఏర్పాటు చేయాల్సి ఉండగా పల్నాడు జిల్లా పోలీ సులు లైట్ గా తీసుకోవడం వల్ల దీంతో సభలో ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యం లో కేంద్రం ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నేతలు నిన్న ఈసీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు సభలో శాంతిభద్రతలను నియంత్రణలో పోలీసు లు స్పష్టంగా కనిపించిందని వారు తెలిపా రు. ప్రధాని సభకు గుంటూరు రెహించుకు చెందిన ఇద్దరు ఎస్పీ లతోపాటు విశాఖ రేంజ్ లో మరో ఎస్పీ కి కూడా బాధ్యతలు అప్పగించారు.
కానీ సభ జరుగుతున్న సమయంలో బాటిళ్లు గ్యాలరీలోకి విసరడం లైట్ టవర్స్ ఎక్కేయడం మైక్ సెట్ పైకి జనం దూసుకు రావడం ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదికపైకి వచ్చేయడం వంటి అంశాల పట్ల కేంద్రం సీరియస్ గా ఉంది.
సెంట్రల్ ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలీస్ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఎస్పీలు ఇచ్చిన వివరణ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.