Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే ఉంటాయి. కొందరు రోజుకు వేల రూపాయల్లో సంపాదిస్తే.. మరికొందరు రోజుకు రూ.లక్షల్లో సంపాదిస్తారు. అయితే కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి గత ఆర్థిక సంవత్సరం అత్యధిక వేతనం అందుకున్న టాప్ ఎగ్జిక్యూటివ్ లలో ఒకరిగా నిలిచారు. తాజా నివేదిక ప్రకారం ఆయన వేతనం రోజుకు రూ. 50లక్షలు అందుకున్నట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం ఆయన వార్షిక వేతనం సుమారు రూ.186 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Breaking News