IT Work From Home : గత మూడేళ్ల కింద (2020) కొవిడ్ విలయం చూశాం. వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం కుదేలైంది. మొదటి వేవ్, రెండో వేవ్ మానవ జాతిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మించి మరణాలు సంభవించాయి. ఇక, కొవిడ్ సోకిన వారిలో అవయవాలు దెబ్బతిని మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. ఇక ఇప్పుడు వైరస్ లో JN 01 సబ్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచం మళ్లీ అప్రమత్తమైంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఐటీ రంగం ఒక్కసారిగా మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిని పాటించేలా కనిపిస్తుంది.
కొవిడ్ మహమ్మారి ఐటీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సంస్కృతికి నాంది పలికింది. కానీ కొవిడ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి.
అయితే, దేశంలో కొవిడ్ జేఎస్ 1 రకం వైరస్ వ్యాప్తి మళ్లీ వేగంగా విజృంభిస్తుండడంతో పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం విప్రో సహా ప్రముఖ ఐటీ కంపెనీలు మళ్లీ డబ్ల్యూఎఫ్హెచ్ కల్చర్ ను కొనసాగించాలని ఆలోచించడం ప్రారంభించాయి.
ఉదాహరణకు, విప్రో ఇటీవల తన ఉద్యోగుల కోసం ఒక హైబ్రిడ్ నమూనాను తప్పనిసరి చేసింది. అక్కడ వారు కార్యాలయం నుంచి 3 రోజులు, డబ్ల్యూఎఫ్హెచ్ లో 2 రోజులు పనిచేయాలి. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ తన ఉద్యోగులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
దేశంలో కొవిడ్-19 కేసుల విజృంభణ ఇలాగే కొనసాగితే మళ్లీ డబ్ల్యూఎఫ్హెచ్ సంస్కృతిలోకి వెళ్లాలని విప్రో యోచిస్తున్నట్లు సమాచారం. యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 4100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఆశ్చర్యకరంగా మారింది. తెలుగు రాష్ట్రంలో మొదటి కొవిడ్ మరణం చవి చూసింది. ఇతర రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
విప్రో డబ్ల్యూఎఫ్హెచ్ ను తిరిగి తీసుకువస్తే, దేశంలోని ఇతర కంపెనీలు కూడా ఇదే పద్ధతిని తిరిగి అవలంభిస్తాయని మనం ఆశించవచ్చు.