26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Karnataka : సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. కంపెనీలను కోరిన కర్ణాటక ప్రభుత్వం .. నీటి ఎద్దడే కారణం!

    Date:

    Karnataka
    Karnataka

    Karnataka : దేశంలోనే సాఫ్ట్ వేర్ హబ్ గా గుర్తింపు సంపాదించుకున్న బెంగళూర్ ను నీటి సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోంలను ప్రకటిస్తే నగరం నుంచి అందరూ వెళ్లిపోతే నీటి కొరతను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతోంది.

    తగినన్ని వర్షాలు లేకపోవడంతో కావేరి నదిలో నీటి మట్టాలు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. నివేదికల ప్రకారం.. బెంగళూరుకు రోజుకు 2,100 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా, కావేరి నది నుంచి రోజుకు 1,450 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే అందుతోంది. నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో నగరంలోని బోరుబావులు ఎండిపోతున్నాయి. ఈ కొరత తాగునీటిపైనే కాకుండా సాగునీటిపై కూడా ప్రభావం చూపిస్తోంది.

    ఇంటి నుంచి 90 రోజుల పని
    నీటి సంక్షోభం దృష్ట్యా ఐటీ సంస్థలు 90 రోజుల వర్క్ ఫ్రం హోంను ప్రకటించాలని ఐటీ ఉద్యోగి నవీన్ కొప్పరం ఎక్స్ (ట్విటర్) వేదికగా యాజమాన్యాన్ని కోరారు. దేశంలోని టెక్కీలు ఎక్కువగా బెంగళూర్ లోనే ఉన్నారు. వారు అందించే అవకాశాల కోసం IT హబ్‌కి మారారు.

    సమస్యను ఎలా పరిష్కరిస్తుంది?
    ఐటీ ఉద్యోగుల్లో 20 నుంచి 30 శాతం మంది తాత్కాలికంగా స్వగ్రామాలకు వెళ్లడం వల్ల బెంగళూరులో రోజువారి నీటి వినియోగం తగ్గుతుందని కొప్పరం వివరించారు. అద్దె, ట్యాంకర్ ఖర్చుతో పాటు రోజువారి ప్రయాణ ఖర్చుల కంటే కేవలం అద్దె చెల్లించి స్వగ్రామానికి వెళ్లడం మంచిదని ఆయన అన్నారు.

    కనుచూపు మేరలో కనిపించని వర్షం
    గత వారం, ప్రముఖ సోషల్ మీడియా వాతావరణ బ్లాగర్, బెంగుళూరు వెదర్‌మ్యాన్ ఎక్స్ పోస్ట్‌లో మార్చి మొత్తానికి ఇప్పుడు పెద్ద వర్షాలు కనిపించడం లేదని తెలియజేశారు. రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు కాంపెనీలు WFH ఇవ్వాలని కోరారు.

    నీటి సంక్షోభం దృష్ట్యా బెంగళూర్ నీటి సరఫరా అండర్ మురుగునీటి బోర్డు (BWSSB) స్విమ్మింగ్ పూల్స్‌ వినియోగాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. స్విమ్మింగ్ పూల్స్‌లో పోర్టబుల్ వాటర్‌ను ఉపయోగించడం నిషేధించబడింది. ఉల్లంఘనకు రూ. 5,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

    ప్రస్తుతం ట్యాంకర్ కు రూ.1,500- రూ.2,000 వరకు నిర్వాహకులు చార్జి తీసుకుంటున్నారు. గతంలో రూ. 700 నుంచి రూ. 800 వరకు మాత్రమే ఉండేది. అది కూడా ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ట్యాంకర్లను తీసుకువస్తున్నారు. ట్యాంకర్ల నిర్వాహకులు ధరలను ఇష్టారీతిన విధిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drinking water : ఇబ్రహీంపట్నం తాగునీటి సంక్షోభం: ప్రజల ఆవేదన, అధికారులపై ఆగ్రహం

    Drinking water : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం.. మైలవరం నియోజకవర్గంలోని...

    HMPV Case : భారత్‌లోకి చైనా వైరస్.. బెంగళూరులో తొలి చైనా HMPV కేసు గుర్తింపు

    HMPV case : చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది....

    Bengaluru: మసాజ్ కోసం పోతే మెడ తిప్పేసిన బార్బర్.. మాట కోల్పోయిన 30ఏళ్ల వ్యక్తి

    Bengaluru: బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి స్థానిక సెలూన్‌కి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. శిక్షణ లేని బార్బర్ హెడ్ మసాజ్ సమయంలో ఓ వ్యక్తి మెడను తిప్పేశాడు.

    Cyber ​​crime : సైబర్ నేరం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి పేరిట లోన్ తీసుకుని మోసం

    Cyber ​​crime : సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని...