Diabetics : మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిస్ (Diabetics) కు రాజధానిగా ఇండియా నిలుస్తోంది. దీని బారిన పడిన వారు నచ్చిన ఆహారం తీసుకోలేరు. తీపి పదార్థాలు తినకూడదు. షుగర్ ఉన్న వారు మామిడిపండ్లు తినకూడదు. ఇందులో షుగర్ లెవల్స్ బాగా ఉంటాయి. అందుకే వీటిని దూరం పెట్టడమే శ్రేయస్కరం. వీటిని తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అరటి పండ్లు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోకూడదు. ఇందులో కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ తో బాధపడేవారు క్రాష్ బెర్రీస్ కు దూరంగా ఉండటం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. క్రాష్ బెర్రీ జ్యూస్ తీసుకోవద్దు.
పైనాపిల్ లో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. బంగాళాదుంపలు, చిలగడ దుంపలు వంటి కూరగాయలు తినడం మానుకోవాలి. వీటికి దూరంగా ఉండేనే లాభం. ఇలా షుగర్ వ్యాధి ఉన్న వారు ఈ ఆహారాల జోలికి వెళ్లకపోవడమే బెటర్. ఇలా షుగర్ పేషెంట్ల కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి.
లిచీ పండ్లు కూడా తినొద్దు. ఇందులో 16 గ్రాముల చక్కెర ఉంటుది. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే ఆహారాల్లో ఇవి కూడా ప్రధానమైనవే. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. ఎప్పుడు కూడా వీటిని తినకుండా చూసుకోవాలి. అంతేకాని ఏది పడితే అవి తింటే చక్కెర స్థాయిలు పెరిగి అనర్థాలు వస్తాయి.