Check For Diabetes Insulin : మధుమేహం విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రోగాల్లో డయాబెటిక్ ఒకటి. దీనికి మన దేశం రాజధానిగా మారుతోంది. షుగర్ పేషెంట్ల సంఖ్య మనదేశంలోనే ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అన్నం. ఇక్కడ అన్నం ఎక్కువగా తినడంతో షుగర్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈనేపథ్యంలో మధుమేహం ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ వాడకం తప్పనిసరి.
షుగర్ పరీక్ష రెండు సార్లు చేస్తారు. తినక ముందు ఒకసారి తిన్న తరువాత మరోసారి చేస్తారు. తినకముందు 110, తిన్న తరువాత 140 మధ్య ఉంటే షుగర్ నార్మల్ గా ఉన్నట్లు. అంతకంటే మించితే కంట్రోల్ లో లేనట్లు లెక్క. 400 దాటితే ఇన్సులిన్ వాడాల్సిందే. మధుమేహం కంట్రోల్ లోకి రావాలంటే ఇన్సులిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది.
కానీ ఇన్సులిన్ వేసుకోవడం వల్ల నొప్పి అనిపిస్తుంది. భయం కూడా వేస్తుంది. దీంతో చాలా మంది ఇన్సులిన్ అంటేనే జంకుతుంటారు. కానీ వైద్యులు మాత్రం ఇన్సులిన్ కు భయపడొద్దు. షుగర్ కు భయపడాలని చెబుతుంటారు. ఇలా డయాబెటిక్ పేషెంట్లకు ఇన్సులిన్ ఒక వరమే. కానీ దాన్ని వేసుకోవడం కాస్త కష్టమే. అందుకే ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
ఇక మీదట అలాంటి భయం అక్కర్లేదు. ఇప్పుడు నోటి ద్వారా కూడా ఇన్సులిన్ వేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బయోఫార్మా కంపెనీలు నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇన్సులిన్ ను రక్తంలోకి పంపడంలో విజయవంతమయ్యాయి. దీంతో ఓజులిన్ తో ఈ బాధ తప్పనుందని చెబుతున్నారు. 2024-25 కల్లా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా ఓరల్ ఇన్సులిన్ ను ఆవిష్కరించాలని చూస్తున్నారు.