Increasing sugar levels Control : దేశంలో మధుమేహం విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఇరవై ఏళ్లకే పట్టి పీడిస్తోంది. దీంతో చాలా బాధపడుతున్నారు. జీవితాంతం మందులు వాడాల్సి వస్తోందని భయపడుతున్నారు. ఈనేపథ్యంలో షుగర్ ను ఎలా అదుపు చేసుకోవాలని నానా తంటాలు పడుతుంటారు. ఒకసారి వచ్చిందంటే చక్కెర ఇక మనల్ని వదిలిపోదు. అందుకే మధుమేహం వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటోంది.
మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతుంది. ఇష్టారాజ్యంగా మనం తీసుకునే ఆహారాలే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. షుగర్ నియంత్రణకు మందులు, ఆహారాలు క్రమ పద్దతిలో తీసుకుంటే ఫలితం కచ్చితంగా ఉంటుంది.
షుగర్ కు జామ పండు మంచి విరుగుడు. మధుమేహంతో బాధపడేవారు జామకాయలు తినడం వల్ల నియంత్రణలో ఉంటుంది. జామాకులు కూడా మంచి ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు రాత్రి భోజనం చేశాక జామ ఆకులు రెండు మూడు నమిలితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నేపథ్యంలో జామాకులు తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
జామ ఆకులు పూర్తిగా పండినవి తీసుకోకూడదు. ముడి చిన్న ఆకులు మాత్రమే తీసుకుంటే మంచిది. మూడు నాలుగు జామాకులు తీసుకుని శుభ్రంగా కడిగి నమలడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. ఇలా జామాకులు తింటే మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈప్రయోగం వైద్యుడి పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది.