Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా మంది 10 గంటల తరువాత టిఫిన్ చేస్తుంటారు. కానీ ఇది సరైంది కాదు. ఉదయం 8 గంటల లోపు అల్పాహారం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. 9 గంటల తరువాత టిఫిన్ చేసే వారిలో మధుమేహం ముప్పు పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఐఎస్ గ్లోబల్ అధ్యయనంలో అల్పాహారం ప్రాధాన్యం గురించి పలు సలహాలు సూచించింది. తిండి వేళలు రక్తంలో గ్లూకోజ్, కొవ్వు మోతాదు నియంత్రణపై ప్రభావం చూపుతాయని తెలయజేసింది. రాత్రి 10 గంటల తరువాత భోజనం చేసే వారిలో కూడా డయాబెటిస్ ముప్పు ఎక్కువవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. టిఫిన్ చేసే వేళల్లో మార్పులుండకూడదు.
బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8 గంటల లోపు చేయడం వల్ల పలు ప్రయోజనాలుంటాయి. మధ్యాహ్నం భోజనం కూడా సరైన సమయంలోనే చేయాలి. లేకపోతే మన జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఏ సమయానికి చేయాల్సిన పని ఆ టైముకు చేయడం మంచి వారి అలవాటు. అందుకే సమయపాలన అవసరం ప్రాధాన్యం గుర్తించి నడుచుకుంటే మంచిది.
ఇలా ఉదయం సమయంలో అల్పాహారం 8 గంటల లోపే తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. రోగాలు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టిఫిన్ చేసే క్రమంలో ఉదయం పూట సరైన సమయంలో చేయడమే మంచిది. ఈ నేపథ్యంలో టిఫిన్ చేయడం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.