Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా షుగర్ కు అందరిలో వ్యాపిస్తోంది. దీంతో జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. మధుమేహం రావడానికి చాలా కారణాలు ప్రభావం చూపుతాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, ఆహార పద్ధతులు, తగిన వ్యాయామం లేకపోవడం వంటి వాటితో డయాబెటిస్ బారిన పడుతున్నారు.
మధుమేహం ఉన్న వారు తమ ఆహార అలవాట్లు మార్చుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మన ఆహారాల్లో పండ్లు అత్యంత ప్రధానమైనవి. ఇవి చక్కెరను కంట్రోల్ లో ఉంచి గ్లూకోజ్ పెరగకుండా చేస్తాయి. అందుకే పండ్లు తినడం వల్ల మనకు మంచి లాభాలున్నాయి. పండ్లలో జామ పండ్లు అత్యంత శ్రేష్టమైనవి. మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే వీటిని తినాలి. ఇవి ఆకలిని తగ్గించడంలో సాయపడుతుంది.
బేరిపండ్లు కూడా షుగర్ ఉన్న వారికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఇందులో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. పైనాపిల్ కంటే బేరిలోనే ఆరోగ్య ప్రయోజనాలు బాగుంటాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కాలేయాన్ని మెరుగుపరుస్తాయి. హెపటైటిస్, హెచ్ సీవీ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. బొప్పాయితో మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు వంటి మానసిక రుగ్మతలను నివారిస్తుంది.
నారింజ పండ్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిక్ పేషెంట్లు నారింజలను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఆపిల్ పండ్లు కూడా తినొచ్చు. ఇందులో కూడా మధుమేహాన్ని తగ్గించే సుగుణాలు ఉండటం వల్ల ఈ పండ్లు తినడం శ్రేయస్కరం. షుగర్ పేషెంట్లు రోజు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.