JC Prabhakar Reddy : వైసీపీ ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి తమను ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదలాపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తప్పులు కేసులు పెట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు సీతారామాంజనేయులు, శివరాంప్రసాద్ లే కారణమని ఆరోపించారు.
వీరంతా పది రోజుల్లో నా బస్సులకు మరమ్మతులు చేయించాలన్నారు. న్యాయం జరగకపోతే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. తన భార్యతో పాటు డీటీసీ కార్యాలయ ఎదుట ధరకనా చేస్తామని తెలిపారు. ఈ వియంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
కాగా, 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేయలేదు. ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి తొలిసారి పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజయం సాధించారు. దీంతో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీచేసి గెలిచారు. అనంతరం ఛైర్మన్ పదవిని చేపట్టారు. అయితే, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య తరచూ ఘర్ణలు జరిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.