YCP Pulivendula : అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వారి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. పులివెందులలో అవినాష్ రెడ్డి బావ, వైసీపీ లీడర్ ఓ వెంచర్ వేసి భవనం నిర్మిస్తున్నారు. అది ఎకరన్నర స్థలంలో ఉంటుంది. గట్టిగా అయితే స్థలం విలువతో పాటు వేసిన పిల్లర్లు, శ్లాబ్ ఖర్చు రెండు కోట్లు కూడా చేయదు. ఇంకా చెప్పాలంటే ఆ ఏరియాలో అసలు కొనేవాళ్లు కాదు కదా.. అద్దెకు వచ్చే వాళ్లు కూడా ఉండరు. ఆ విషయం వారికీ తెలుసు. కానీ కొనేందుకు మన ప్రభుత్వం ఉంది కదా అని రంగంలోకి దిగారు.
వెంటనే కలెక్టర్ పులివెందులలో పర్యాటకుల కోసం అద్భుతమైన ఫోర్ స్టార్ హోటల్ కట్టేందుకు సగం కట్టిన భవనం రెండున్నర ఎకరాల్లో ఉంది కొనాలని టూరిజం శాఖకు రిక్వెస్ట్ పెట్టారు. వాస్తవానికి పులివెందులకు పర్యాటకులు ఒక్కరూ రారు. అయినా వెంటనే కొనాలని సీఎంవో నుంచి ఒత్తిళ్లు రావడంతో… టూరిజం అధికారులు ఏకంగా పన్నెండున్నర కోట్లు పెట్టి కొనేశారు. ఈ దెబ్బతో ప్రజాధనం పది కోట్లకుపైగా అవినాష్ రెడ్డి బావ ఖాతాలో పడింది. విచిత్రం ఏమిటంటే… అక్కడ ఆ భవనం ఉంది ఎకరన్నర స్థలంలో అయితే కలెక్టర్ రెండున్నర ఎకరాల్లో ఉందని కొనుగోలు చేయాలని చెప్పడం. అయితే కొనుగోలు సమయంలో అంత స్థలం లేకపోవడంతో ఉన్న స్థలాన్నే అదే డబ్బులతో కొనేశారు.
దీనిని బట్టి అర్థం అవుతుంది.. ప్రజాధనాన్ని ఎంత ఈజీగా కోట్లకు కోట్లు ఎలా కొట్టేశారో.. ఇది విన్న ప్రజలు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు పన్నులరూపంలో కట్టే సొమ్మును సొంత ఖాతాలకు ఇంత అడ్డగోలుగా మల్చుకున్నారంటే.. పోను పోను బయటపడేవి ఇంకెంత ఘోరంగా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఇక ఖజానా అంతా మా సొత్తే అన్న చందంగా వ్యవహరించిన వారికి మరోసారి ఎవరూ అలా చేయని విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.