Nityananda Swami. : భారతదేశం ఆధ్యాత్మికమైనది. ఇక్కడ భక్తులు గుళ్లు, గోపురాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత స్వాముల, సన్యాసులకు కూడా ఇస్తారు. వారితో తమ కష్టాలను చెప్పుకుంటే పరిష్కారం దొరుతుందని భావిస్తారు. ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఎంతో మంది ఎదిగారు. అందులో నిత్యానంద ఒకరు. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈయన విపరీతమైన ఫాలోయింగ్ భక్తులు ఉన్నారు. ఈయన నిర్వహించే ఆశ్రమాలు, ట్రస్ట్ లకు కోట్లాది రూపాయలు అంతర్జాతీయంగా ఫండ్స్ రావడంతో పాటు ఇక్కడి భక్తులు కూడా ఎక్కువగానే సమర్పిస్తుంటారు.
ఆధ్యాత్మికత, భక్తి భావంలో మునిగిపోవాల్సిన సదరు నిత్యానంద కామక్రీడల్లో మునిగిపోయారు. నటితో శృంగారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా కెమెరాలకు చిక్కారు. దీంతో ఆయన బండారం బయటపడింది. ఆయన ఆశ్రమంపై పోలీసులు రైడ్ చేశారు. దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆశ్రమంలో స్వామి నిత్యానంద చేసిన రాసలీలతో పాటు అమ్మాయిల మిస్సింగ్స్, హరాజ్మెంట్ అంతా వెలుగు చూసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు శిక్ష అనుభవించిన స్వామి నిత్యానంద బయటకు వచ్చాడు. రీసెంట్ గా ఆయనపై డిస్కవరీ చానల్ ‘మై డాటర్ జాయిన్డ్ కల్ట్’. అని డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేసింది. ఇందులో డిస్కవరీ చాలా అంశాలను వెలుగులోకి తెచ్చింది.
జైలు నుంచి బయటకు వచ్చిన నిత్యానంద దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కోట్లాది రూపాయల డబ్బు, బంగారంతో ఒక దీవిలో సెటిల్ అయ్యాడు. ఆ దీవీకి ‘కైలాశ దీవి’ అని పేరు పెట్టుకున్నాడు. అక్కడ తానే దేవుడినని ప్రకటించుకున్నాడు. అయితే, ఇటీవల ఆ దీవికి ప్రధానమంత్రిగా తన శిష్యురాలు, చెలికత్తె అయితన నటి రంజితను నియమించాడు. ఈ విషయాన్ని ఒక ప్రముఖ తమిళ పేపర్ ప్రచురించింది. నిత్యానంద కూడా తన సొంత వెబ్ సైట్ లో దీని గురించి పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వెబ్ సైట్ లో రంజిత చిత్రం కింద ‘నిత్యానందమయి స్వామి’ అని ఉంది. దాని కింద హిందువుల కోసం ఏర్పాటైన కైలాస దేశ ప్రధాని అని ఉంది.
ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల కైలాస దేశం తరుఫున ఐక్య రాజ్యసమితి సమావేశంలో మహిళలు రాయబారులుగా కూడా పాల్గొన్నట్లు మనకు తెలిసిందే. ఇదే కోవలో నటి రంజిత కూడా త్వరలో ఐక్యరాజ్య సమితి ప్రధాని హోదాలో పాల్గొన్నా ఆశ్చర్యం అవసరం లేదు.