Prime Minister : బీజేపీలో ప్రధాని ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నా ఆయన వయసు సెప్టెంబర్ 17 నాటికి 74 ఏళ్లు నిండుతుంది. బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారు పదవుల్లో ఉండకూడదనేది నిబంధన. దీంతో మోడీ వారసుడి కోసం అప్పుడే వేట మొదలైంది. ఈ నేపథ్యంలో మోడీ వారసుడు ఎవరనే దానిపై పలు సర్వేలు జరుగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ వారసుడిగా కేంద్ర మంత్రి అమిత్ షాను చెబుతున్నారు. అమిత్ షా కూడా గుజరాత్ కు చెందిన వాడే. వ్యూహాలు రచించడంలో దిట్ట. రెండు సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి షా వ్యూహాలు బాగా పనిచేశాయి. ఈ క్రమంలో మూడోసారి కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకా మోడీ వారసుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. కానీ ఆయన మంచి పరిపాలన దక్షుడే కానీ వ్యూహాలు రచించడం రాదు. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పేరు బయటకు వస్తోంది. ప్రధాని పదవి రేసులో ఉండే వారి గురించి అప్పుడే చర్చ మొదలైంది. మోడీ వారసుడిగా ఎవరిని తీసుకుంటారనే వాదన బలంగా వస్తోంది.
బీజేపీలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో యోగి ఆదిత్య నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో మోడీ ప్రధాని అయినా 2025 సెప్టెంబర్ 17న పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అలాగే మురళీమనోహర్ జోషి, ఎల్ కే అద్వానీకి పదవులు దక్కకుండా పోయాయి. దీంతో మోడీ వారసుడిగా యోగి తెరమీదకు వస్తున్నారు. ఎక్కువమంది ఎంపీలు కలిగిన వాడిగా అతడినే దింపనున్నారని టాక్.