CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్, మోడీ, అమిత్ షా కలిసి చంద్రబాబును పథకం ప్రకారం జైలు కు పంపారని ఆయన ఆరోపించారు.
దేశంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని రామకృష్ణ అన్నారు. మోడీ అంటే భయంతో నే చంద్రబాబు, జగన్ బిజెపికి మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి ఈసారి రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని రామకృష్ణ ఎద్దేవా చేశారు..
దేశంలో రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి బీజేపీ వల్ల కలికిందని ఆయన మండిపెట్టారు. రైతుల సమ స్యలు పట్టించుకోని బిజెపి ప్రభుత్వం. దొంగ చాటున అధికారంలోకి రావడానికి పలు రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేసింద ని ఆయన మండిప డ్డారు. రానున్న ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.