PM Modi’s Mission :
కాశ్మీర్ లో చొరబాట్లు ఇటీవల పూర్తిగా తగ్గాయి. గత ఆరు నెలల్లో ఒక్క చొరబాటు కూడా కాలేదు. దీనికంతటికి కారణం ఏంటి..? సరిహద్దుల్లో సైన్యం పెంచిందా.. అంటే లేదు. మరి చొరబాట్లు ఎందుకు ఆగాయి. గతంలో కాశ్మీర్ లోకి పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, చొరబాటుదారులు వస్తూ వెళ్తుండేవారు. ఇప్పుడవన్నింటికీ అడ్డుకట్ట పడింది.
కాశ్మీర్ లో చొరబాట్లు ఆగడమంటే ఇది భారత్ కు పెద్ద విజయం. కాశ్మీర్ ను చేజిక్కించుకోవాలని పాకిస్థాన్ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇందుకోసం అక్కడ అల్లర్ల సృష్టించడం, భయాందోళనలు రేకెత్తించడం పనిగా పెట్టుకుంది. గతంలో నెహ్రూ తెచ్చిన రెండు చట్టాల కారణంగా పాకిస్థాన్ ఆగడాలు తగ్గలేదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు ఆర్టికల్ 370, 35 చట్టాలకు రాజ్యంగ సవరణ చేసి, ఆ చట్టాలను తొలగించాక, ఇక చొరుబాట్లు ఆగిపోయాయి. ఇంతకాలం సరిహద్దు దాటేసి వచ్చి అల్లర్లు సృష్టించి, మళ్లీ వెనక్కి వెళ్లిపోయే వారికి అడ్డుకట్ట పడింది. కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటే భయం కలిగేలా వారికి బుద్ధి చెప్పింది.
ఇటీవల కేంద్రం కీలక ప్రకటన చేస్తూ గత ఆరు నెలల్లో ఒక్క చొరబాటు కూడా జరగలేదని స్పష్టం చేసింది. రెండేళ్లలో సుమారు 80 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. కాశ్మీర్ ప్రజల్లో కూడా పూర్తి మార్పు వస్తున్నది. వారు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ టూరిజం పెరిగింది. పరిశ్రమలు పెరిగాయి ఉద్యోగాలు పెరిగాయి. సరికొత్త సుందర కశ్మీర్ దిశగా ఇప్పుడు ఈ సరిహద్దు రాష్ర్ట వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మొత్తానికి మోదీనే హీరో అని చర్చ కొనసాగుతున్నది. ఆ రెండు చట్టాలు రద్దు చేయడం, జమ్ము, కశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణమనే వాదన వినిపిస్తున్నది.