![Sand Smuggling Case Against Chandrababu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/11/pic.webp)
Sand Smuggling Case Against Chandrababu : చంద్రబాబుపై మరో కేసు తిరగదోడుతున్నారు. ఆయన హయాంలో జరిగిన ఇసుక రవాణా విషయంలో జరిగిన అక్రమాలపై మరోమారు సీఐడీ అధికారులు విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు నమ్ముతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. బాబును లక్ష్యంగా చేసుకుని కేసులు వేసేందుకు అధికారులు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ కేసులో ఏ -1గా పీతల సుజాతను ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చుతున్నారని సమాచారం. వీరంతా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారనే ఉద్దేశంతో మైన్స్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో వీరిపై నేరారోపణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మైన్స్ అధికారుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇలా చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైసీపీ ప్రభుత్వం ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో తెలియడం లేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం దీనికి బదులు తీర్చుకుంటామని అంటున్నారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.