![Anurag Kashyap](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/anurag-kashyap-1.jpg)
Anurag Kashyap : సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీ స్వరూపమే మారిందని చెప్పవచ్చు. గతంలో రామ్ గోపాల్ వర్మ ప్లేస్ ను వంగా ఆక్యుపై చేశాడని ఇండస్ట్రీలో టాక్. ఆయన తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. అర్జున్ రెడ్డితో ఎంట్రీ ఇచ్చిన వంగ అదే సినిమాను బాలీవుడ్ లో కభీర్ సింగ్ తో తీశారు. ఇక ఇటీవల వచ్చిన యానిమల్ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించింది. ఇప్పుడు స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సదీప్ వంగ ప్రభాస్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు.
యానిమల్ భిన్న అభిప్రాయాలను దక్కించుకున్న నేపథ్యంలో కల్ట్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ వంగా గురించి గతంలో మాట్లాడారు. ‘సందీప్ వంగాను తప్పుగా అర్థం చేసుకున్నా. ధూషించా కూడా.’ అంటూ చెప్తూనే ఇటీవల యానిమల్ బాలీవుడ్ గేమ్ ఛేంజర్ గా అనురాగ్ ఇటీవల అభివర్ణించారు. ఆయన ఇలా ప్రశంసించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కశ్యప్ బాలీవుడ్ సినిమాపై యానిమల్ ప్రభావాన్ని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, అడల్ట్ కంటెంట్, మూడున్నర గంటల సినిమా తీయాలన్న వంగను సమర్థించుకున్నారు. హిందీ సినిమాల్లో ఇది ఒక అద్భుతమని ఆయన అభివర్ణించారు. వంగాకు తన మద్దతు ఉంటుందని చెప్పిన కశ్యప్, పరిశ్రమ నుంచి వచ్చే ఒత్తిడిలను ఎలా ఎదర్కోవాలో నొక్కి చెప్పారు. తన సొంత చిత్రం బాంబే వెల్వెట్ ఎదుర్కొ్న్న కొన్ని అనుభవాలను పోల్చాడు.
బాంబే వెల్వెట్ చిత్రీకరణ సమయంలో కశ్యప్ సెన్సార్ షిప్ తో పోరాటం చేశాడు. ఇక్కడ యూ/ఏ సర్టిఫికెట్ రావాలంటే సినిమాలో చాలా చేంజస్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తనకు ఎవరి మద్దతు లేదని అందుకే ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చిందన్నారు. కానీ సందీప్ వంగా లాగా ఒత్తిడికి లొగకుండా దృఢంగా నిలవలేకపోయినందుకు సినిమాలో చాలా సీన్స్ కోల్పోయానని, వంగ నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు.