![Minister Sridhar Babu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/JygW42e.jpg)
Minister Sridhar Babu : తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’కు ఆయన హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.
ప్రవాసులు పుట్టిన ఊరుకు మేలు చేసేలా గ్రామ పురోగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేరళలో ప్రవాసుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తుందని అంతకన్నా గొప్పగా త్వరలో ‘తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లాలో త్వరలో 1000 కోట్లతో కోక కోలా మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదరిందని వివరించారు శ్రీధర్ బాబు. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీట్ అండ్ గ్రీట్లో చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, సురేష్ రెడ్డి, ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, వాషింగ్టన్ డీసీ విభాగం ఉపాధ్యక్షులు కోట్య బానోత్, ముండ్రాతి రాము, ఎగ్జిక్యూటివ్ కమిటీ టీం సునీల్ కుడికాల, మధు యనగంటి తదితరులు పాల్గొన్నారు.