![Vyjayanthi Movies](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Vyjayanthi-movies.webp)
Vyjayanthi Movies : వైజయంతి మూవీస్ అంటే నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినీ ప్రేక్షకులకే తెలుసు. కానీ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మూవీని తీసి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి వైజయంతీ మూవీస్ ను అశ్విని దత్ 1972 లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది నటీ నటులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేశ్ బాబును రాజకుమారుడు సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించి మహేశ్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. మహేశ్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హిరోగా కొనసాగుతున్నాడు.
గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్ ను కూడా వైజయంతి బ్యానర్ పైనే తీసుకొచ్చాడు. ఈ మూవీలో హిరోయిన్ అదితి అగర్వాల్ ను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నందమూరి వంశం నుంచి నందమూరి తారకరత్నను ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమాలో హిరోగా అవకాశం ఇచ్చి నందమూరి వంశం నుంచి మరో హిరోను ప్రమోట్ చేశారు.
చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్ ను తెలుగు సినిమాకు కూడా వైజయంతి మూవీస్ నుంచి పరిచయం చేశారు. బాణం మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం లోో నాని హిరోగా నటించిన విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లాంటి హిరో హిరోయిన్లను పరిచయం చేశారు. మహానటి లో తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించారు. సీతారామం సినిమాలో హిరోయిన్ మృణాల్ ఠాకూర్ ను కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బ్లస్టర్ బంపర్ హిట్ గా నడుస్తూ రికార్డు బ్రేక్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.