![Minister Ram Prasad Reddy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-18-9.jpg)
Minister Ram Prasad Reddy : మాజీ సీఎం జగన్ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ఆయనను వెంటాడుతన్నాయన్నారు. అధికారం చేపట్టిన 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగం చేయించుకున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు.
ఎవరిపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అందరికీ తెలిసిందేనని, మాచర్లలో నరమేధం సృష్టించారని మండిపడ్డారు. టీడీపీ బీసీ నేత తోట చంద్రయ్యను నడిరోడ్డుపై నరికి చంపారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.