![AP DGP](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/e8dc1bf4-2c2e-4354-8f5a-18e98046eba3.jpg)
UBlood Dairy to AP DGP : యూ బ్లడ్ ఖ్యాతి ఎల్లలు దాటుతోంది.. రక్తదానం మహాదానం అంటూ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో రూపొందించిన యాప్ ‘యూ బ్లడ్’. ఈ యాప్ ద్వారా ఇప్పటికీ ఎంతో మంది లబ్ధిపొందారు. అంతటి మహోన్నత క్రతువు గురించి తాజాగా వివరించేందుకు ‘యూ బ్లడ్ కన్వీనర్, ఏపీ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం గారు’ ఏపీ డీజీపీని కలిశారు.
మంగళగిరిలో ఏపీ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు గారిని యూ బ్లడ్ కన్వీనర్, ఏపీ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం గారు, ఏపీ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆదివారం (జూన్ 23) రోజున కలిసి ‘యూబ్లడ్’ డైరీని అందజేశారు. ఈ సందర్భంగా డా.జై గారి సేవలు డీజీపీ గారికి వివరించారు. యూబ్లడ్ సేవలు, డా.జై గారి ఉద్దాత్త సేవలను ఏపీ డీజీపీగారు ప్రశంసించినట్టు తెలిసింది.
యూ బ్లడ్ సేవలను విస్తరిస్తే కోట్లాది మంది ప్రాణాలను రక్షించిన వారం అవుతామని, యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారి ఆశయాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నాయకులు. ఈ సారి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వారి పరిధిలో యూ బ్లడ్ యాప్ గురించి, అది అందించే సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సరైన సమయంలో రక్తం అందక ఎంత మంది మరణిస్తున్నారో వివరిస్తున్నారు.
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాలని ఎవరికైనా రక్తం అవసరమైతే యూ బ్లడ్ యాప్ ద్వారా పొందవచ్చని నాయకులు వివరిస్తున్నారు. అయితే అది నాయకుల వరకే కాకుండా అధికారుల వద్దకు కూడా తీసుకెళ్తున్నారు. అధికారులు కూడా ఇలాంటి సమాజానికి అవసరమైన యాప్ లతో మరింత మేలు కలుగుతుందని వివరిస్తున్నారు. వారు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడంతో పాటు ఇతరులతో పాటు ఇన్ స్టాల్ చేయిస్తున్నారు.