![Venu Swamy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/250857-prabahs.webp)
Venu Swamy : జ్యోతిష్కుడు వేణు స్వామికి గడ్డు రోజులు నడుస్తున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు ఏదీ చెప్పినా అది జరగడంతో నేను చెప్పిందే వేదం అన్నంతా బిల్డప్ ఇచ్చి తన రూటే సపరేటు అని క్రియేట్ చేసుకున్నాడు. అయితే కాలం అందరికీ సమాధానం చెబుతుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రస్తుతం వేణు స్వామికి అదే జరుగుతుంది. ఇతరుల జీవితాలపై జ్యోతిష్యం అనే పేరు చెప్పి ఆటలాడిన వేణుస్వామికి ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు.
ముఖ్యంగా వేణు స్వామి ఆరు నెలల కిందట బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీం గెలిచి కప్ కొడుతుందని చెప్పాడు. ఫైనల్లో సన్ రైజర్స్ ఓడిపోయి కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఇలా వేణు స్వామి చెప్పిన రెండు బెడిసి కొట్టాయి. దీంతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
అయితే వేసవిలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని రాసు పెట్టుకోండని చెప్పాడు. అసలు చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యే అవకాశమే లేదని చెప్పగా.. ఆ వీడియోలను పట్టుకుని జనసేన, టీడీపీ నాయకులు వేణు స్వామిని ఆటాడుతున్నారు. నీకెందుకురా జ్యోతిష్యం అంటూ తెగ కామెంట్స్ చేశారు. తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఇతడిపై ప్రముఖ రచయిత దర్శకుడు గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో తిరగనీయద్దని అతడిని కంట్రోల్ చేయాలని చెప్పాడు. బార్, పబ్ లలో కూర్చుని, మద్యం తాగి, మందు తినేవాడు జ్యోతిష్యం చెప్పడం ఏమిటని అన్నారు.
ప్రభాస్ సినిమాలు ఇక ఆడవని, బహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ అంతా బాగో లేదని అన్నాడు. అయితే అతడు అన్నట్లు బాహుబలి తర్వాత ఆదిపురుష్, రాధేశ్యాం, సాహో అంతంత మాత్రం ఆడటంతో కొంచెం చెలరేగిపోయాడు. అయితే సలార్ సినిమాతో డార్లింగ్ భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు కల్కి 2898 తో మరోసారి ఓ రేంజ్ లో హిట్ కొట్టడంతో ప్రభాస్ అభిమానులు వేణుస్వామిపై ట్రోల్స్ చేస్తున్నారు. జాతకాలు చెప్పడం మానేసి ఓ మూలన కూర్చోమని ప్రభాస్ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.