Prabhas :
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు కొద్ది రోజులుగా కాలం కలిసి రావడం లేదు. సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఇక ఏం చేయాలో తోచడం లేదు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తరువాత చెప్పుకోదగ్గ హిట్ సాధించలేదు. సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ ఇలా వరుసగా సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. దీంతో ప్రభాస్ కెరీర్ డోలాయమానంలో పడింది.
ఓం రౌత్ ను నమ్ముకుని ఆదిపురుష్ చేశాడు. దానిపై విమర్శలు వెల్లువలా వచ్చాయి. ప్రభాస్ పాత్ర బాగా లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో ఇక ఇప్పటి నుంచి బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన చేయడం లేదు. ఆదిపురుష్ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొంత కాలం బాలీవుడ్ వైపు చూడకూడదనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో ప్రభాస్ తరువాత సినిమా సలార్ మీదే ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దీనికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటంతో అందరి అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ దర్శకుల కథలను రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సిద్ధార్థ ఆనంద్ సినిమా కూడా చేయడం లేదనే టాక్ వస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత అంతటి రేంజిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు తరువాత సినిమాలు నిరాశ పరచాయి. ఈనేపథ్యంలో వచ్చే సినిమాల ప్రభావం ఎలా ఉంటుందోననే సందేహాలు వస్తున్నాయి. సలార్ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. అది విడుదలై ప్రభంజనం చేస్తుందా లేక ఇదివరకటి సినిమాల్లాగా నిరుత్సాహ పరుస్తుందో తెలియడం లేదు.