Lokesh Padayatra :
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగా సాగుతుంటాయి. ఒక్కోసారి పక్క వాళ్లకు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇందులో టీడీపీ, వైసీపీ ,జనసేన ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఈ విచిత్రాలు జరుగుతుంటాయి.
ఏపీలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగుతుండగా, అక్కడి వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే తాజాగా వారు చేసిన పని అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. లోకేష్ బాబు పాదయాత్ర కొనసాగుతున్న దారిలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. అసలు వాడు వచ్చే వరకు.. కొసరువాడికి పండుగేనని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీ టీడీపీ నేతలు పెట్టారని అనిపించేలా చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలను కూడా అందులో ముద్రించారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కూడా ఇవి టీడీపీ నాయకులు పెట్టినట్లుగా కథనాలు వడ్డి వార్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎక్కడ ప్రింట్ అయ్యాయా.. అని ఆరా తీస్తే అవి వైసీపీ నేతలు ముద్రించినట్లుగా బయటపడింది.
స్థానిక నేత బాలినేని ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో ఈ పని చేయించాడని తెలిసిపోయింది. దీంతో వైసీపీ నేతల పరువు పోయినట్లయ్యింది. వాళ్లే ఈసారి సీఎం గా జగన్ కారని భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నదని టిడిపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రకు అడ్డు తగిలేలా వైసీపీ కుట్రలు చేస్తూనే ఉన్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీలు కట్టి నీచ రాజకీయాలకు దిగిందని, లోకేష్ అంటే ఆ పార్టీలో భయం పుట్టుకుందని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ReplyForward
|