43.9 C
India
Friday, May 24, 2024
More

    Lokesh Padayatra : ఫ్లెక్సీ పెట్టించి.. అడ్డంగా బుక్కైన వైసీపీ నేత..!

    Date:

    Lokesh Padayatra :
    ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగా సాగుతుంటాయి. ఒక్కోసారి పక్క వాళ్లకు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇందులో టీడీపీ, వైసీపీ ,జనసేన ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఈ విచిత్రాలు జరుగుతుంటాయి.
    ఏపీలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగుతుండగా, అక్కడి వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే తాజాగా వారు చేసిన పని అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. లోకేష్ బాబు పాదయాత్ర కొనసాగుతున్న దారిలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. అసలు వాడు వచ్చే వరకు.. కొసరువాడికి పండుగేనని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీ టీడీపీ నేతలు పెట్టారని అనిపించేలా చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలను కూడా అందులో ముద్రించారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కూడా ఇవి టీడీపీ నాయకులు పెట్టినట్లుగా  కథనాలు వడ్డి వార్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎక్కడ ప్రింట్ అయ్యాయా.. అని ఆరా తీస్తే అవి వైసీపీ నేతలు ముద్రించినట్లుగా బయటపడింది.
    స్థానిక నేత బాలినేని ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో ఈ పని చేయించాడని తెలిసిపోయింది. దీంతో వైసీపీ నేతల పరువు పోయినట్లయ్యింది. వాళ్లే ఈసారి సీఎం గా జగన్ కారని భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నదని టిడిపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రకు అడ్డు తగిలేలా వైసీపీ కుట్రలు చేస్తూనే ఉన్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీలు కట్టి నీచ రాజకీయాలకు దిగిందని, లోకేష్ అంటే ఆ పార్టీలో భయం పుట్టుకుందని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    CM Revanth : రేవంత్ ‘మార్పు’ మొదలైనట్లేనా?

    CM Revanth : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి...

    Rajinikanth : దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న రజనీకాంత్

    Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం...

    Cannes Film Festival 2024 : భారతీయ లఘు చిత్రానికి కేన్స్ లా సినీఫ్ ఫస్ట్ ఫ్రైజ్

    Cannes Film Festival 2024 : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్...

    Visakhapatnam : పరుగులు పెట్టినా ఫలితం లేదు.. విశాఖలో ఒకే ప్లాట్ ఫాంపై రెండు రైళ్లు

    Visakhapatnam : విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పరుగులు పెట్టినా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...