Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన లక్ష్యమని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్ వాసులతో ఆయన మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ర్టంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో మార్పులు చేస్తామని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఒక్క విద్యాసంస్థను తీసుకురాలేదని అన్నారు.
ప్రస్తుతం గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని అన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కరెంటు చార్జీలు, ఇంటి, చెత్తపన్ను పెంచి సామాన్యుడికి భారంగా మార్చారని లోకేశ్ విమర్శించారు.