![Raj Tarun](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-14-1.jpg)
Raj Tarun : సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2012 నుంచి తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ విషయమై రాజ్ తరుణ్ ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను బెదిరించారని, సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది.
లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. రాజ్ తరుణ్ పై గురువారం సాయంత్రం తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు చెప్పారు.