![Ranbir Kapoor](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/ranbir-kapoor.jpg)
Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు ఇతర దేశాలకు కూడా పవిత్రమైనది. సకలగుణాభి, మర్యాద పురుషోత్తముడు అయిన రాముడి పాత్రలో నటించాలంటే నటులు రాసుకొని పుట్టాలి. ఇప్పటి వరకు ఎంతో మంది రాముడి పాత్రలో నటించారు. ప్రతీ సినిమా, టెలివిజన్ సీరియల్ లో రామాయణం చేసిన సమయాల్లో ఎన్ని అలవాట్లు ఉన్నా పక్కన పెట్టడం నటులకు ఆనవాయితే.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో రాముడి పాత్రను రణ్ బీర్ చేస్తున్నాడు. సినిమా పూర్తయ్యే వరకు మద్యం, ధూమపానం, మాంసాహారం లాంటివి రణ్ బీర్ మానేశానని గతేడాది వార్తలు వచ్చాయి.
అయితే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో రణ్ బీర్ డ్రింక్ పట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రణబీర్ సుహానా ఖాన్ తో మాట్లాడుతుండగా, పక్కనే షనయా కపూర్, ముఖేష్, ఆకాష్ అంబానీ ఉన్నారు.
‘రణ్ బీర్ కపూర్ రామాయణం కోసం మద్యం మానేయడం కేవలం పీఆర్ చర్య మాత్రమే’ అంటూ ఓ నెటిజన్ ఈ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇంకొక నెటిజన్ ‘అతను కూడా శాకాహారి కాబోతున్నాడు.. అతను తన ‘పెద్ద గొడ్డు మాంసం మనిషి’ ఇమేజ్ ను మరోసారి దక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మూడో యూజర్ సరదాగా ‘ఇది జీడిపప్పు జ్యూస్. ఆయన పీఆర్ రాసిన వ్యాసాలు వస్తున్నాయి. విస్కీ గ్లాసులో టీ తాగుతున్నాడని అతని పీఆర్ చెబుతాడు’ అని మరొకరు తెలిపారు. కొందరు అభిమానులు రణ్ బీర్ ను సమర్థిస్తూ ఆ డ్రింక్ నాన్ ఆల్కహాలిక్ అంటూ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రామాయణంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’లో అలియా భట్, విక్కీ కౌశల్ జంటగా నటిస్తున్నారు రణ్ బీర్.