యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్ కూడా. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు తారక్ ఏం చేసినా సరే అది ఇండియాలోనే కాకుండా ఫారెన్ లో కూడా సెన్సేషన్ గా మారుతోంది. తారక్ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా.. తెలుగు ఆడియన్స్ తో పాటు విదేశాల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటే రచ్చే సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది.
ఎన్టీఆర్ 30 తో మ్యాన్ ఆఫ్ మాస్ మానియా కోసం గ్లోబల్ వైల్డ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనురుథ్. ఎన్టీఆర్ థర్టీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న అనురుథ్… న్యూ జెర్సీలో ఓ లైవ్ షోలో ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన ధీమ్ సాంగ్ ప్లే చేశాడు. అలా మ్యూజిక్ ప్లే అయ్యిందో లేదో స్టేడియం మొత్తం ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది . కొన్ని సెకన్ల మ్యూజిక్ బిట్ కే అరిచి రచ్చ రచ్చ చేశారు యంగ్ టైగర్ అభిమానలు. ఈ థీమ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాక అమెరికా లో ప్రజెంట్ ఈ ధీమ్ సాంగ్ టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ 30 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ సీన్ తో స్టార్ట్ అయిపోయింది . త్వరలోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ కోసం ఆల్రెడీ గోవాలో ఓ సెట్ నిర్మించారని తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున రూపొందించనున్నారు. హాలీవుడ్ టెక్సిషియన్లను రంగంలోకి అంచనాలు పెంచారు మేకర్స్. రోజురోజుకు హైప్ పెంచుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల కానుంది.