Check for Diabetes with Sunlight : ప్రస్తుత రోజుల్లో మధుమేహం వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా మన దేశం విస్తరిస్తోంది. మధుమేహుల సంఖ్య ఆసియా ఖండంలోనే ఎక్కువగా వస్తోంది. భారత్, చైనా దేశాల్లోనే ఎక్కువగా వస్తోంది. ఇక్కడే అన్నం ఎక్కువగా తినడంతో షుగర్ వ్యాధి వెంటాడుతోంది. దీనికి సరైన వ్యాయామం, ఆహారాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందని గుర్తించారు.
డయాబెటిక్ ను నియంత్రణలో ఉంచుకోకపోతే ముప్పు ఏర్పడుతుంది. పగటి వేళలతోపాటు రాత్రి వేళల్లోనూ ఉద్యోగాలు చేయడం వల్ల టైప్ 2 మధుమేహం వస్తోంది. సరైన జీవక్రియ లేకపోవడం వల్ల షుగర్ మనల్ని తాకుతోంది. పగటి సమయంలో వచ్చే సహజ కాంతి శరీర అంతర్త జీవ గడియారానికి బలమైన సంకేతం. పగటి సమయంలో చాలా మంది ఇళ్లు, కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు.
మధుమేహం ఉన్న వారు నిర్దిష్ట సమయంలో సహజ కాంతిలో ఉండాలి. దీంతో వారి జీవక్రియకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి. దీంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువ సేపు సాధారణ స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. శరీర జీవడియారం నియంత్రణలో పెర్ 1, క్రై1 అనే జన్యువులు మనకు సాయపడతాయి. దీంతో షుగర్ అదుపులో ఉండేందుకు సహకరిస్తుంది.
మనం ఎప్పుడు నీడలో ఉండటం వల్ల మన శరీర భాగాలకు సరైన శక్తి అందదు. దీంతో సూర్యరశ్మి తగినంత అందితే అవయవాలు సరిగా పనిచేస్తాయి. మనకు సూర్యరశ్మి అత్యవసరం. సూర్యరశ్మిలో ఉంటే మనకు చాలా లాభాలున్నాయి. అందుకే మధుమేహం కంట్రోల్ లో ఉండాలంటే ఎండ వేడి మనకు తగలాల్సిందే. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సూర్యరశ్మి అందకపోవడంతోనే షుగర్ పెరుగుతోందని గుర్తిస్తున్నారు.