నిన్న హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో నిమోనియా లక్షణాలున్న ఇద్దరు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ తేలడంతో పిల్లల తల్లి,దండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిమోనియా లక్షణాలు ఉన్న వారిలో కోవిడ్ పాజిటీవ్ వస్తుండటంతోో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా రెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో పాటుగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులపై అధిక ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. కరోనా వల్ల కూడా నిమోనియా సోకుతుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తీవ్రమైన జ్వరం ఆయాసం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలని వారు తెలిపారు.