ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో నేడు చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. మును పెన్నడూ లేనివిధంగా అక్కడి తొమ్మిది మారుమూలల గ్రామా ల్లో త్రివర్ణ పతాకం రెపరెపలా డనుంది. స్వాతంత్రం వచ్చిన తర్వా త ఎన్నడూ ఇక్క డ జాతీయ పతాకం ఎగర లేదని అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పెరుగు తున్న భద్రతకు ఇది సాక్ష్యం అని వారు పేర్కొన్నారు. మావో యి స్టులకు బస్తర్ కీలక ప్రాంతంగా ఉంటూ వచ్చింది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కునగా ఉన్న ఈ తోమ్మిది ప్రాంతాల్లో ప్రజలు ఇంతవరకు జెండాను ఎగరవేయలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్స రాలు గ డుస్తున్నా కానీ ఆ గ్రామాల్లో ఇప్పటికి వరకు మన జాతీయాజెండా ఎగరలేదు. ఈ సంవత్సరం మాత్రం తో మ్మిది గ్రామాల్లో కూడా జాతీయ జెండా ఎగరబోతుంది. ప్రజల్లో వచ్చిన మార్పు,ధైర్యం నేపద్యంలో తోలిసారి జెండా ఎగరబోతుంది..భారీ బందోబస్తు నడుమ అక్కడి గ్రామాల ప్రజలు ఈ సారి జాతీయ జెండాను ఎగరవేయబోతున్నారు.