Ranbir Kapoor : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే తిరుమలలోని శ్రీవారి చెంత ఘనంగా జరిగింది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ను విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్.. ట్రైలర్.. పోస్టర్లు.. సాంగ్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈ సినిమాకు సంబంధించిన 10 వేల టికెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్నాడు. పేద పిల్లల కోసం ఈ సినిమా టికెట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్ట్ న్యూస్ బయటికి వస్తుండటంతో అందరూ ‘ఆదిపురుష్’ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.