Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రుషి కొండను మింగిన అనకొండ జగన్ అని విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం తీర ప్రాంతానికి రక్షణ గోడలా నిలిచిన రుషికొండను జగన్ అనే అవినీతి అనకొండ మింగేసిందని ధ్వజమెత్తారు.
9 నగరాల్లో తొమ్మిది ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడు జగన్ అని నారా లోకేశ్ విరుచుకు పడ్డారు. జగన్ అవినీతి అనకొండ అని మండి పడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మింగిన కొండలు, వేల కోట్లు కక్కిస్తాం అని స్పష్టం చేశారు.
మరోవైపు ఆదివారం విశాఖ పట్టణం జిల్లా నారా లోకేశ్ పర్యటిస్తారు. ఉదయం విశాఖపట్టణం తూర్పు నియోజకవర్గం, మధ్యాహ్నం దక్షిణ నియోజకవర్గం, సాయంత్రం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తారు. విశాఖలో నారా లోకేష్ శంఖారావ సభలు ఉంటాయి.