![Bihar](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-14-10.jpg)
Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్ రాష్ట్రంలో అందుకు భిన్నం. కళ్ల ముందు కట్టినవి.. కళ్ల ముందే కూలిపోతున్నాయి. ప్రారంభించిన రోజులకే నేల మట్టమవుతున్నాయి. అలా ఒకటీ రెండూ అనుకుంటే మామూలే.. కానీ, 16 రోజుల్లో రాష్ట్రంలో అక్షరాలా 10 వంతెనలు కూలిపోయాయి.
బీహార్ లో గురువారం (జులై 4) మరో వంతెన కూలిపోయింది. కేవలం 16 రోజుల వ్యవధిలో బీహార్ లో ఇది పదో సంఘటన. సరనక జిల్లాలో గండకి నదిపై బనేయాపూర్ బ్లాక్ లో ఈ వంతెన ఉంది. సరన్ లోని అనేక గ్రామాలను కలుపుతూ 15 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జిని నిర్మించారు. గడిచిన 24 గంటల్లో రెండు వంతెనలు కూలిపోయాయని జిల్లా మేజిస్ట్రేట్ అమన్ చెప్పారు. వంతెన కూలిపోవడానికి కారణాలు తెలియలేదన్నారు. ఈ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
బీహార్ లో జూన్ 18న అరారియాలో ఒక బ్రడ్జి కూలిపోయింది. ఆ తర్వాత జూన్ 22న సివాన్లో ఒకటి, జూన్ 23న ఈస్ట్ చంపారన్లో ఒకటి, 27న కిసాన్ గంజ్ లో ఒకటి, 28న మధుబనిలో ఒకటి, జులై 1న ముజాఫర్ పూర్ లో ఒకటి, జులై 3న సివాన్ లో 1, సరాన్ లో 2, జులై 4న సరాన్ లో ఒక బ్రిడ్జి కూలిపోయాయి.