Atal Bihari Vajpayee : 1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇతర పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి వాజ్ పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే 13 నెలల తరువాత అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు బీఎస్పీ మద్దతు ఇస్తామని ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గలేదు. అనంతరం 1999 ఎన్నికల్లో ఎన్డీయే సంపూర్ణ మెజారిటీ సాధించింది.
దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. 1996లో భిన్నమైన పార్టీలను, శక్తులను ఏకం చేసి ప్రధానమంత్రి పదవిని వాజ్ పేయి అధిష్టించారు. ఆ తర్వాత తనకు మద్దతు లేదని తెలుసుకుని 13 రోజుల అనంతరం తన ఓటమిని అంగీకరించి పదవిని వీడారు. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కూడ ఒకే ఒక్క ఓటు అవసరమైనా ఏ ఇతర ఎంపీని ప్రలోభాలకు గురిచేయలేదు.