Raghurama : వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు బీజేపీ షాక్ ఇచ్చింది. నరసాపురం టికెట్ కూట మిలో నీ ఏ పార్టీకి దక్కినా.. తానే పోటీ చేస్తానని పలుమార్లు చెప్పుకున్న అయనకు ఇప్పుడు నిరాశే మిగిలింది. ఆ స్థానాన్ని శ్రీనివాస వర్మకు బీజేపీ కేటాయించింది.
ఇప్పుడు ఆయనకు టీడీపీ లో చేరి కూటమి అభ్యర్థి కి సపోర్టు చేస్తారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. విజయ నగరం ఎంపీ గా టీడీపీ తరుపున పోటీ చేస్తారు అనే ప్రచారం సాగుతోంది.
మొత్తం వైసిపి ఎంపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సీఎం జగన్ ను వ్యతిరేకిస్తూ ఆయన పై విమర్శలు చేయడo తోపాటు తిరిగిబాటు చేశారు.
గత కొద్ది రోజులుగా సొంత పార్లమెం టుకు కూడా రాకుండా ఢిల్లీలోనే గడిపారు. వైసీపీ నుండి నాయకులనుండి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక బిజెపికి మద్దతు ప్రకటించారు. ఇంతకాలం మద్దతు పలికిన బిజెపి నుంచి టికెట్ లభిస్తుం దని ఆశించిన రఘు రామ కు గట్టి షాక్ తగిలింది.