Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 798 పాజిటీవ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 5 మరణాలలో కేరళలో 2, మహా రాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,091 ఉన్నా యని తెలిపారు. కాగా ఇప్పటి వరకు దేశంలో 157 కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు వెలుగు చూశాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ లు తప్ప నిసరిగా ధరించి సామాజిక దూరాన్ని పాటిం చాల ని అధికారులు హెచ్చరి స్తున్నారు. జలుబు జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యు లను సంప్రదించాలని సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.