Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్ .1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్త ము 511 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా కర్ణాటకలో 119, కేరళలో 148 కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో జేఎన్.1 వేరియంట్ కేసులు రెండు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా బయటపడలేదని తెలిపారు.
ఇక దేశవ్యా ప్తంగా ప్రస్తుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసులు 4,440 ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మొత్తం మీద కరోనా కొత్త వేరియంట్ కేసులు కర్ణాటక, కేరళలో రాష్ట్రం ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల కు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు కేసులు నమోదు కాని రాష్ట్రాలు ఇక మీదట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఎక్కు వగా కేసులు నమోదు అవు తున్న రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి అలా అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ లు చేసిన తర్వాత నే రాష్ట్రం లోకి అనుమతి ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఇలా జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బయట పడవచ్చు అని అధికారులు తెలిపారు.