![CBI Investigation](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/cbi-gets-three-new-joint-directors.jpg)
CBI Investigation : కేసుల్లో నిగూఢంగా దాగున్న వాస్తవాలను బయటకు తీసేందుకు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్)ను కేంద్రం నియమిస్తుంది. చాలా వరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో పరిష్కారం కాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తుంది. ఈ టీం సదరు కేసులో ఉన్న ప్రతీ క్లూను వెలికితీసి బాధ్యులను కోర్టుకు అప్పగిస్తుంది.
అలాంటి సీబీఐ టీమ్ లో బాధ్యతతో కూడిన మంచి ఆపీసర్లు పని చేస్తుంటారు. ఈ టీమ్ దాదాపుగా అవినీతికి లొంగదు. కానీ భోపాలో జరిగిన ఒక కుంభకోణం విషయంలో టీమ్ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీబీఐ డిపార్ట్ మెంట్ ఆ కేసుపై పని చేస్తున్న ఆఫీసర్లపై మరో సీబీఐ ఎంక్వయిరీ వేసింది. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని తెలుస్తోంది.
భోపాల్ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో అవకతవకలు, మౌలిక వసతుల కొరత ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ పని కోసం సీబీఐ అధికారుల బ్యాచ్ ను నియమించి విధుల్లోకి తీసుకున్నారు. అయితే కొందరు సీబీఐ అధికారులు రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలతో కుమ్మకై లంచాలకు బదులుగా ఫిట్మెంట్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ కాలేజీల నుంచి ఒక్కో సర్టిఫికేషన్ కు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. వీరిలో ఇద్దరు డైరెక్ట్ సీబీఐ ఇనిస్పెక్టర్లుగా తేలింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే సీబీఐ సెంట్రల్ వింగ్ ఈ విషయం తెలుసుకొని ప్రస్తుతం ఉన్న సీబీఐ ఇన్ స్పెక్టర్ల బృందంపై మరో సీబీఐ విచారణ వేసింది. ఈ కుంభకోణాన్ని త్వరితగతిన వెలికితీసిన సెకండ్ టీం 13 మందిని అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రాయోజిత సీబీఐ దర్యాప్తు అధికారులు కుంభకోణానికి పాల్పడినందుకు సొంత సిబ్బందిని అరెస్టు చేయడం ద్వారా సీబీఐ ఇప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.